Tollywood NewsTrending News

ఏడాది పాటు ఎన్నో పోరాటాలు చేశాను… సమంత పోస్టు వైరల్!

ఏడాది పాటు ఎన్నో పోరాటాలు చేశాను… సమంత పోస్టు వైరల్!

ఏడాది పాటు ఎన్నో పోరాటాలు చేశాను… సమంత పోస్టు వైరల్!

 ఏడాది పాటు ఎన్నో పోరాటాలు చేశాను… సమంత పోస్టు వైరల్!
ఏడాది పాటు ఎన్నో పోరాటాలు చేశాను… సమంత పోస్టు వైరల్!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి సమంత గత ఏడాది భయంకరమైనటువంటి మయూసైటిసిస్ వ్యాధి బారిన పడిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ వ్యాధి నుంచి సమంత కోలుకొని తిరిగి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమెకు మయో సైటీసెస్ వ్యాధి నిర్ధారణ జరిగి ఏడాది పూర్తి కావడంతో మరోసారి ఈ వ్యాధి గురించి ఆమె తలచుకోవడమే కాకుండా ఈ వ్యాధి నుంచి బయటపడటానికి తాను ఎంత కష్టపడ్డాను అనే విషయాలన్నింటిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. సమంత గత ఏడాది జూన్ 15వ తేదీ మయోసైటీసిస్ బారిన పడ్డానని నిర్ధారణ జరిగింది అంటూ ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈ విషయం గురించి స్పందిస్తూ.. వ్యాధి నిర్ధారణ జరిగి ఏడాది పూర్తి అయింది. ఎంతో కష్టపడి సాధారణ స్థితికి వచ్చాను. ఈ ఏడాది పాటు నా శరీరం ఎన్నో పోరాటాలను ఎదుర్కొంది. బలవంతంగా మందులు తీసుకుంటూ ఈ వ్యాధితో పోరాటం చేశానని తెలిపారు.అలాగే ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం తాను ఎంతలా కష్టపడ్డారు ఎంతమంది దేవుళ్లకు ప్రార్థించారు అన్న విషయాలన్నింటి గురించి సమంత ఈ పోస్ట్ ద్వారా తెలియజేశారు.

ఈ విధంగా సమంత (Samantha) మయోసైటిస్ వ్యాధి సోకినప్పుడు తనకు కలిగినటువంటి ఇబ్బందుల గురించి ఆ ఇబ్బందుల నుంచి తాను ఎలా బయటపడ్డారనే విషయాల గురించి తలుచుకొని షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. దీనితోపాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

please remove ad blocker