Avanthipura Simhasanam

Avanthipura Simhasanam – 9 | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu

Avanthipura Simhasanam - 9 | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu

Avanthipura Simhasanam – 9 | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu

prasad_rao16

Avanthipura Simhasanam | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu
Avanthipura Simhasanam | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu
ఇక ఆ రెండు రోజులు ఆదిత్యసింహుడు పక్కనే ఉన్న అరణ్యం లోకి ప్రభావతితో కలిసి వేటకు వెళ్ళి అక్కడే ఆమెను మళ్ళీ అనుభవించిన తరువాత రాజప్రాసాదానికి వచ్చేవారు.

అలాగే రాత్రిళ్ళు కూడా ఆదిత్యసింహుడు చెట్టు ద్వారా ప్రభావతి మందిరంలోకి వచ్చి ఆమెను తన కసితీరా అనుభవిస్తున్నాడు.
ప్రభావతికి కూడా ఆదిత్యసింహుడు ఇచ్చే సుఖం నచ్చడంతో అడ్డు చెప్పకుండా అతనికి నచ్చినట్టు ఉంటూ సుఖాన్ని ఇచ్చింది.
రెండు రోజుల తరువాత ఆదిత్యసింహుడు రాజపరివారం దగ్గర వీడ్కోలు తీసుకుని రమణయ్యతో కలిసి అక్కడ నుండి బయలుదేరాడు.

ప్రభావతితో సంగమం జరిగిన తరువాత ఆదిత్యసింహుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తన రాజ్యానికి వెళ్ళి పెళ్ళి విషయం ప్రస్తావించాలని అనుకున్నాడు.
దాంతో ఆదిత్యసింహుడు రమణయ్యతో కలిసి తన చిన్నన్న వీరసింహుడు ఉన్న ప్రాంతానికి బయలుదేరాడు.
నాలుగు రోజులు ప్రయాణించిన తరువాత ఆదిత్యసింహుడు, రమణయ్య వీరసింహుడు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడ ఆదిత్యసింహుడిని చూడగానే వీరసింహుడు చాలా సంతోషంతో ఎదురెళ్ళి తన తమ్ముడిని ప్రేమతో ఆలింగనం చేసుకుని తన శిబిరం లోకి తీసుకెళ్ళాడు.
లోపలికి వెళ్ళిన తరువాత వీరసింహుడు, “ఏంటి తమ్ముడు….అమ్మా, నాన్న అందరూ బాగానే ఉన్నారు కదా,” అనడిగాడు.
ఆదిత్యసింహుడు : అంతా బాగానే ఉన్నారు అన్నగారూ….తల్లిగారి దగ్గర నుండి మీకోసం విశేష సమాచారం తెచ్చాను…
వీరసింహుడు : ఏంటది….
ఆదిత్యసింహుడు : అది వింటే మీరు సంతోషంతో ఉప్పొంగిపోతారు….
వీరసింహుడు : ముందు ఆ వార్త చెప్పు ఆదిత్యా….సంతోషమో…లేక మరొకటో నేను చెబుతాను…(అంటూ నవ్వాడు.)
ఆదిత్యసింహుడు : మీకు వివాహం చేయాలని అనుకుంటున్నారు….
ఆ మాట వినగానే వీరసింహుడి మొహంలో ఏవిధమైన భావం కనిపించలేదు.
అదిత్యసింహుడు : ఏంటన్నయ్యా….మీకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదా….
వీరసింహుడు : (తన తమ్ముడి వైపు చూసి నవ్వుతూ) అదేం లేదు తమ్ముడూ….కాకపోతే పెళ్ళి అయిన తరువాత ఇప్పుడు ఉన్నంత స్వతంత్రంగా ఉండలేం కదా….అదే ఆలోచిస్తున్నా…..
ఆదిత్యసింహుడు : అలాగ ఏమీ ఉండదులే అన్నయ్యా….ఇప్పుడు ఒంటరిగా వేటకు వెళ్తున్న వారు….వివాహం అయిన తరువాత వదినగారిని తీసుకుని వెళ్ళండి…..
తరువాత వాళ్ళిద్దరూ తమ పర్యటనల్లో విశేషాలను చెప్పుకున్నారు.
ఆదిత్యసింహుడు తన శిబిరానికి వచ్చిన తరువాత విరించిని (లేఖలు రాసేవాడు) పిలిపించి, “మీరు మా తల్లి గారికి ఒక లేఖ రాయాలి,” అన్నాడు.
విరించి తల వంచి ఆదిత్యసింహుడికి నమస్కారం చేస్తూ, “తప్పకుండా యువరాజా….ఏం రాయమంటారో చెప్పండి…” అంటూ తన ముందు లేఖను పెట్టుకుని ఆదిత్యసింహుడు చెప్పింది రాసాడు.
లేఖ పూర్తి అయిన తరువాత ఆదిత్యసింహుడు మొత్తం ఒకసారి చదివి తన సంతకం పెట్టబోతుండగా వీరసింహుడి దగ్గర నుంది వర్తమానం రావడంతో హడావిడిగా వెళ్తూ విరించితో, “ఈ లేఖని మా తల్లిగారికి సత్వరమే పంపించండి,” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

విరించి కూడా ఆ లేఖను తీసుకుని ఆదిత్యసింహుడు తన రాజముద్ర వేసాడనుకుని దూతని పిలిచి లేఖను ఇచ్చి మహారాణీ కళావతి గారికి ఇవ్వమని చెప్పాడు.
దాంతో ఆ దూత ఆ లేఖను తీసుకుని అక్కడ నుండి అవంతీపుర రాజభవనం వైపుగా వెళ్ళిపోయాడు.
అలా వెళ్ళిన ఆదిత్యసింహుడు, వీరసింహుడితో కలిసి అక్కడ తిరుగుబాటు దారుల మీద యుధ్ధానికి వెళ్ళాడు.
యుధ్ధం రెండు రోజుల పాటు జరిగిన తరువాత తిరుగుబాటుదారులనందరిని బంధించి వీరసింహుడు రాజభవనానికి బయలుదేరాడు.
అదిత్యసింహుడు తాను లేఖ పంపించాను కదా అన్న ఆలోచనతో ఒక వారం రోజులు వనయాత్ర చేస్తానని చెప్పడంతో వీరసింహుడు రాజ్యానికి బయలుదేరాడు.
******
తరువాత రోజు దూత వెళ్ళి మహారాణీ కళావతికి ఆ లేఖను అందించాడు.
కళావతి : ఎక్కడ నుండి తీసుకొచ్చావు….
దూత : వీరసింహుడి గారి దూతను మహారాణి…..
దానితో కళావతి కూడా ఆ లేఖను పంపించింది వీరసింహుడే అని అనుకున్నది.
పైగా దానిలో ఆదిత్యసింహుడి రాజముద్ర లేకపోయేసరికి….దూత కూడా వీరసింహుడి దూత అయ్యేసరికి ఆమె ఆదిత్యసింహుడు పంపించి ఉంటాడని ఊహించలేకపోయింది.
కళావతి ఆ లేఖ తీసుకుని చదవడం మొదలుపెట్టింది.

లేఖలో : ప్రియమైన తల్లిగారికి పాదాభివందనం చేస్తూ రాయునది…నేను ఇక్కడ  కామపుర రాజ్యాధినేత యశోవర్ధనుడి కుమార్తె యువరాణి ప్రభావతిని చూడటం జరిగింది….ఆమెను చూడగానే వివాహం చేసుకోదలిచాను….అందుకు మీ అనుమతి కోసం ఈ లేఖను పంపించుచున్నాను….రెండు మూడు దినములలో నేను రాజ్యానికి తిరిగివస్తాను…అంతలో మీరు కామపురరాజు యశోవర్ధనుడితో సంప్రదించి మీరు వివాహ ముహూర్తము నిర్ణయించకోరుతున్నాను….
ఆ లేఖ చదవగానే వీరసింహుడు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నందుకు…పైగా కన్యను కూడా ఎంచుకున్నందుకు కళావతి చాలా సంతోషపడిపోయింది.
దాంతో కళావతి వెంటనే తగిన రాజలాంచనాలతో తన దూతను పంపించి వివాహ ముహూర్తాన్ని నిర్ణయించింది.
ఇదంతా జరుగుతుండగా వీరసింహుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు.

లేఖలో : ప్రియమైన తల్లిగారికి పాదాభివందనం చేస్తూ రాయునది…నేను ఇక్కడ  కామపుర రాజ్యాధినేత యశోవర్ధనుడి కుమార్తె యువరాణి ప్రభావతిని చూడటం జరిగింది….ఆమెను చూడగానే వివాహం చేసుకోదలిచాను….అందుకు మీ అనుమతి కోసం ఈ లేఖను పంపించుచున్నాను….రెండు మూడు దినములలో నేను రాజ్యానికి తిరిగివస్తాను…అంతలో మీరు కామపురరాజు యశోవర్ధనుడితో సంప్రదించి మీరు వివాహ ముహూర్తము నిర్ణయించకోరుతున్నాను….
ఆ లేఖ చదవగానే వీరసింహుడు వివాహం చేసుకోవడానికి నిర్ణయించుకున్నందుకు…పైగా కన్యను కూడా ఎంచుకున్నందుకు కళావతి చాలా సంతోషపడిపోయింది.
దాంతో కళావతి వెంటనే తగిన రాజలాంచనాలతో తన దూతను పంపించి వివాహ ముహూర్తాన్ని నిర్ణయించింది.
ఇదంతా జరుగుతుండగా వీరసింహుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు.

పెళ్ళిప్రస్తావనలు తెలియని వీరసింహుడు రాజభవనం అంతా కోలాహలంగా….అలంకరణలతో నిండిపోయే సరికి ఏదో ఉత్సవం జరుగుతున్నదనుకుని తన మందిరానికి వెళ్ళాడు.
అక్కడ తన అంతరంగీకుడు దీలీపుడిని పిలిపించుకుని….

వీరసింహుడు : ఏం జరుగుతుంది….ఏదైనా ఉత్సవ సన్నాహాలు చేస్తున్నారా….

దిలీపుడు : కాదు యువరాజా….మహారాణీ కళావతి గారు మీకు వివాహం చేయ నిశ్చయించారు….ముహూర్తం కూడా నిర్ణయించారు….

వీరసింహుడు : నాకు తెలియకుండా నా వివాహమా….ఇప్పుడే వెళ్ళి మా తల్లి గారిని అడుగుతాను….(అంటూ అక్కడ నుండి మహారాణీ కళావతి దగ్గరకు వెళ్లబోయాడు.)

కాని దిలీపుడు వెంటనే వీరసింహుడి ముందు ఒక చిత్రపటాన్ని పెట్టి….

దీలీపుడు : మీరు మీ మందిరానికి రాగానే మీకు ఈ చిత్రపటాన్ని చూపించమన్నారు….

ఆ పటం మీద బొమ్మ కనిపించకుండా దాని మీద పట్టు గుడ్డ పరిచి ఉన్నది.

వీరసింహుడు : ఏమున్నది ఆ చిత్రపటంలో….

దిలీపుడు : మీరు చేసుకోబోయే కామపుర యువరాణి చిత్రపటం…ఈమెను చూసిన తరువాత కూడా మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మహారాణి గారి దగ్గర మీ అభ్యంతరం తెలుపవచ్చు…..

దాంతో వీరసింహుడు ఆ పటం మీద ఉన్న పట్టుగుడ్డని తీసి చూసే సరికి ప్రభావతి ఆందాన్ని చూస్తూ అలాగే మైమరిచిపోయాడు.

ప్రభావతితో వివాహాన్ని తన తల్లి కళావతి నిశ్చయం చేసిందని వీరసింహుడు అనుకుంటున్నాడు.

వీరసింహుడు ఇష్టపడ్డాడని ప్రభావతితో వివాహం నిశ్చయించింది కళావతి.

అలా కళావతి, వీరసింహుడు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ వివాహాన్ని నిర్ణయించారని అనుకుంటున్నారు.

వీరసింహుడి ముఖకవళికలు చూసి దిలీపుడు కూడా అతనికి రాకుమారి నచ్చిందని అర్ధమయింది.

దిలీపుడు : ఇక మహారాణి గారి దగ్గరకు వెళ్ళి అంగీకారం తెలుపుదురుగాని పదండి…..

దాంతో ఇద్దరూ కలిసి మహారాణీ కళావతి దగ్గరకు వెళ్ళారు.

దిలీపుడు : (మహారాణికి అభివాదం చేస్తూ….) మహారాణీ….యువరాజా వారు వివాహానికి ఒప్పుకున్నారు….

కళావతి : ఒప్పుకోక ఏం చెస్తాడు….ప్రభావతి లాంతి అందగత్తెను ఎవరు మాత్రం ఒదులుకుంటారు…(అంటూ వీరసింహుడి వైపు చూసి…) ఆదిత్యసింహుడు నీదగ్గరకు వస్తానని ఇక్కడ నుండి పయనమయినాడు….నీ దగ్గరకు చేరలేదా….

వీరసింహుడు : వచ్చాడు మాతా….కాని అక్కడ సరిహద్దుల్లో తిరుగుబాటు దారులు ఎక్కువయ్యారు….వారిని అణిచివేసి వస్తానని చెప్పాడు….మీరు రమ్మన్నారని నేను వచ్చాను….

కళావతి : అలాగే నీ వివాహ సమయానికి వచ్చేలా ఆదిత్యసింహుడికి సందేశం పంపించు….

వీరసింహుడు : అలాగే మాతా….

కళావతి : మన ఆచారం ప్రకార నీ కత్తికి బాసికం కట్టి రాకుమారితో వివాహం జరిపిస్తాము….కాబట్టి నీవు రాజ్యంలోనే ఉండు….

వీరసింహుడు అలాగే అన్నట్టు తల ఊపాడు.

తరువాత రెండు రోజులకు అవంతీపుర ముఖ్యపరివారం మొత్తం కామపుర రాజ్యానికి వివాహానికి బయలుదేరారు.

ఇక్కడ ప్రభావతి కూడా తన వివాహం ఆదిత్యసింహుడితో అనే భావించి సంతోషపడిపోతున్నది.

వివాహానికి ముందు శయ్య మీద ఒకటి అయినా అంతా సవ్యంగా వివాహం జరుగుతున్నందుకు ప్రభావతికి గుండెల మీద భారం దిగినట్టు అయ్యి ప్రశాంతంగా ఉన్నది.

నాలుగు రోజులకు రత్నసింహుడి పరివారం మొత్తం కామపుర రాజ్యానికి చేరుకున్నది.

అప్పటికే యశోవర్ధనుడు వాళ్ళు విడిది చేయడానికి మందిరాలను ఏర్పాటు చేసాడు.

వీరసింహుడు తన వివాహ సమాచారం ఆదిత్యసింహుడికి పంపించాడు.

కాని ఆ లేఖ ఆదిత్యసింహుడికి అందకపోవడంతో అతనికి వివాహం గురించి తెలియక తిరుగుబాటుదారులతో యుధ్ధం చేస్తున్నాడు.

రెండు రోజుల తరువాత ఆదిత్యసింహుడు తిరుగుబాటుదారులను అణిచివేసి తన శిబిరంలో అలిసిపోయి పడుకున్నాడు.

కొద్దిసేపటికి వార్తాహరుడు వచ్చి, “ప్రభూ….” అని పిలిచాడు.

ఆదిత్యసింహుడు కళ్ళు తెరిచి అతని వైపు చూసి, “ఏంటి….” అన్నాడు.

వార్తాహరుడు : ప్రభూ….మహారాణీ కళావతి గారి నుండి అత్యవసర లేఖ తీసుకొచ్చాను….మీకు ఈ లేఖ అందిన వెంటనే మిమ్మల్ని బయలుదేరమన్నారు….

ఆదిత్యసింహుడు : ఏమైనా విశేషమా….

వారాహరుడు : అవును ప్రభు…వీరసింహుల వారి వివాహ మహోత్సవావనికి రమ్మని సందేశం….

ఆదిత్యసింహుడు : (ఆనందంతో అతని దగ్గర లేఖ తీసుకుంటూ) ఇది చాలా సంతోషకరమైన వార్త….మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము….(అంటూ లేఖని తీసి చదువుతున్నాడు.)

ఆ లేఖలో సారాంశం చదివిన వెంటనే ఆదిత్యసింహుడి మొహంలో రంగులు మారడం మెదలయింది.

దాంతో ఆదిత్యసింహుడు వెంటనే రమణయ్యని పిలిపించాడు.

రమణయ్య వచ్చిన వెంటనే ఆదిత్యసింహుడు వార్తాహరుని వైపు చూసి, “ఇక్కడ నుండి బయలుదేరడానికి ఏర్పాట్లు చేయండి…” అన్నాడు.

వార్తాహరుడు సరె అని తల ఊపుతూ ఆదిత్యసింహుడుకి అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రమణయ్య : ఏమయింది యువరాజా….ఎందుకంత కలవరపడుతున్నారు…(ఆదిత్యసింహుడిని చూసి జరగకూడనిది ఏదో జరిగిందని అర్ధం అయింది.)
ఆదిత్యసింహుడు ఏమీ మాట్లాడకుండా తన చేతిలో ఉన్న లేఖను రమణయ్యకు ఇచ్చాడు.

   రమణయ్య ఆ లేఖ తీసుకుని చదివిన తరువాత ఆదిత్యసింహుడి వైపు అందోళనగా చూస్తూ, “ఏంటి ప్రభూ….ఈ విపరీతం…మీరు వివాహమాడాల్సిన ప్రభావతీదేవి గారిని మీ అన్నగారు వివాహమాడటం ఏంటి…అదీ మహారాణీ గారు దగ్గర ఉండి చేయించడం ఏంటి,” అనడిగాడు.

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Avanthipura Simhasanam – 9, అవంతీపుర సింహాసనం ,Telugu Boothu Kathalu

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button