Avanthipura Simhasanam

Avanthipura Simhasanam – 14 | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu

Avanthipura Simhasanam - 14 | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu

Avanthipura Simhasanam – 14 | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu

prasad_rao16

Avanthipura Simhasanam | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu
Avanthipura Simhasanam | అవంతీపుర సింహాసనం | Telugu Boothu Kathalu
మంజుల : (వెంటనే తల ఎత్తి ఆదిత్యసింహుడి వైపు చూస్తూ) అవును ప్రభూ….మీరు ఇస్తున్న సుఖంలో పడి చెప్పడం మరిచిపోయాను…

ఆదిత్యసింహుడు : ఏదైనా ముఖ్య సమాచారం తెచ్చావా….
మంజుల : అవును ప్రభూ…నేను మీకు అనుకూలంగా మీ వదిన స్వర్ణమంజరితో ఏకాంత సమావేశం ఏర్పాటు చేద్దామని వనవిహారం వెళ్ళే పధకం చెప్పాను ప్రభూ….
ఆదిత్యసింహుడు : మరి ఏమయింది…మా వదిన అంత తొందరగా లొంగదు కదా…..
మంజుల : అవును…నేను చెప్పిన పధకాన్ని మార్చి తన దండనాయకులతో వనవిహారంలో మిమ్మల్ని బంధించాలని పధకం వేసింది…..
ఆదిత్యసింహుడు : (ఈ సమాచారం ముందే తెలిసినా….తెలియనట్టు నటిస్తూ) అంత పధకం వేసిందా….

మంజుల : అవును ప్రభూ….వనవిహారానికి వెళ్ళీన తరువాత మిమ్మల్ని మీ పరివారం నుండి వేరు చేసి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి తన దండనాయకుల సహాయంతో తన భర్త పట్టాభిషేకం అయ్యేంత వరకు మిమ్మల్ని బంధించాలని పధకం రూపొందించింది…..

ఆదిత్యసింహుడు : (తల్పం మీద నుండి లేచి కూర్చుని పంచెని కట్టుకుంటూ) వనవిహారానికి ముహూర్తం ఎప్పుడు పెట్టింది….
మంజుల : ఇంకా ఎప్పుడు అనేది నిర్ణయించలేదు ప్రభూ…నా అంచనా ప్రకారం వచ్చే వారంలో ఉండొచ్చు….
ఆదిత్యసింహుడు : సరె….సమావేశంలో పాల్గొన్న దండనాయకులు ఎవరు….
మంజుల : మొత్తం నలుగురు ప్రభూ….(అంటూ వాళ్ళ పేర్లు చెబుతూ ఆమె కూడా తల్పం దిగి బట్టలు వేసుకున్నది.)
ఆదిత్యసింహుడు : సరె….నువ్వు వెళ్ళు….అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు చేరవేస్తుండు…
మంజుల : అలాగే ప్రభూ….(అంటూ అక్కడనుండి వెళ్ళబోయింది.)
ఆదిత్యసింహుడు : కాని మా వదిన స్వర్ణమంజరితో జాగ్రత్తగా ఉండు….ఆమెకు ఏమాత్రం అనుమానం వచ్చినా నీకు ప్రాణహాని తప్పదు….
మంజుల అలాగే అన్నట్టు తల ఊపి ఆదిత్యసింహుడికి అభివాదం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయింది.
మంజుల వెళ్ళిపోయిన తరువాత ఆదిత్యసింహుడు కొద్దిసేపు ఆలోచనలో పడిపోయి…ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా తల ఊపి తన సేవకుడిని పంపి తన దండనాయకులను సమావేశం అవ్వాల్సిందిగా ఆదేశించాడు.
తరువాత ఆదిత్యసింహుడు తన దండనాయకులతో, మంత్రి వర్గంతో సమావేశం అయ్యాడు.
అలా సమావేశం అయిన వాళ్ళల్లో మహామంత్రి పూర్ణయ్య కూడా ఉన్నారు.
ఆదిత్యసింహుడు తన దండనాయకుల వైపు గంభీరంగా చూస్తూ….
ఆదిత్యసింహుడు : నగర శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి….
దండనాయకుడు : అంతా మన కనుసన్నల్లోనే ఉన్నాయి ప్రభూ….
ఆదిత్యసింహుడు : ఇక విషయానికి వస్తే…ఇది చాలా ముఖ్యమైన విషయం…(అంటూ పూర్ణయ్య వైపు చూస్తూ) సమస్య చాలా గంభీరమైనది పూర్ణయ్య గారూ….
పూర్ణయ్య : ఇంతకూ విషయం ఏంటి ఆదిత్యా….
ఆదిత్యసింహుడు : చాలా విశ్వసనీయ సమాచారం మంత్రివర్యా….మా పెద్దన్న గారి పట్టాభిషేకం ఏ ఆటంకం లేకుండా జరగడానికి మమ్మల్ని బందీ చేయడానికి ఒక పధకం రూపొందుతున్నది….
పూర్ణయ్య : అంత సాహసం ఎవరికి ఉన్నది ఆదిత్యా….(అంటూ నవ్వుతూ) అయినా నాకు తెలిసి నువ్వు ఇప్పటికే దానికి విరుగుడు కూడా ఆలోచించి ఉంటావు కదా….
ఆదిత్యసింహుడు : (చిన్నగా నవ్వుతూ) ఒక వ్యూహం పన్నాను పూర్ణయ్య గారు…అది అమలుచేయడానికి రమణయ్య గారిని నియమించాను…
పూర్ణయ్య : కాని నిన్ను బంధించాలనుకోవడం మీ వదిన స్వర్ణమంజరి పిచ్చి ప్రయత్నమే అవుతుంది….
ఆదిత్యసింహుడు : అందుకే ఆమెకు అన్ని వైపుల నుండీ ఏ విధమైన సహాయం అందకుండా అష్టదిగ్బంధనం చేయాలి…
పూర్ణయ్య : నువ్వు తలుచుకుంటే అది ఎంత సేపు ఆదిత్యా….ఇంతకు ఆ సమావేశ సారాంశం ఏంటి….
ఆదిత్యసింహుడు : ఏం లేదు పూర్ణయ్య గారూ….తొందరలోనే మా వదిన స్వర్ణమంజరి వనవిహారానికి వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు…ఆ వనవిహారంలో పాల్గొనమని మా వదిన గారు నన్ను ఆహ్వానిస్తారు….అక్కడ మమ్మల్ని బందీ చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి….(అంటూ వాళ్ళ సమావేశ సారాంశం మొత్తం వివరంగా చెప్పాడు.)
పూర్ణయ్య : (గట్టిగా నిట్టూరుస్తూ) కాని ఇది చాలా అవివేకమైన పని ఆదిత్యా….ఈ చర్యకు మీ అన్నగారు ఎలా అంగీకరించారో నాకు అవగతం కావడం లేదు….
ఆదిత్యసింహుడు : ఈ వనవిహార సమావేశం ఇంకా మా అన్నగారికి తెలియదు…ఈ పధకం మొత్తం అన్నగారి అనుపస్థితిలో జరిగింది…కాబట్టి ఆయనకు ఈ పధకం వివరాలు ఏమీ తెలియవు….కేవలం మా వదిన స్వర్ణమంజరి మాత్రమే తన దండనాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించింది….
పూర్ణయ్య : మరి నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు…
ఆదిత్యసింహుడు : (చిన్నగా నవ్వుతూ) నాకు ఏం చేయాలో తోచకే తగురీతిన సలహా ఇస్తారనే మిమ్మల్ని ఇక్కడకు రప్పించే శ్రమ కల్పించాను….
అంతలో దండనాయకుడు లేచి మాట్లాడబోతుండగా ఆదిత్యసింహుడు కనుసైగతోనే అతన్ని మాట్లాడొద్దని వారించాడు.
పూర్ణయ్య : (ఆదిత్యసింహుడు తనకు ఇస్తున్న ప్రాధాన్యతకు మనసులో సంతోషిస్తూ) ముందు ఈ విషయాన్ని మీ అన్నగారితో చర్చించడం ఉత్తమం అనిపిస్తున్నది….
ఆదిత్యసింహుడు : (ఆలోచిస్తున్నట్టు తల ఊపుతూ) మీరన్నది ఉచితంగానే ఉన్నది పూర్ణయ్య గారు…నేను సమయం చూసుకుని అన్నగారితో చర్చించడమే ఉత్తమం అనిపిస్తున్నది….
పూర్ణయ్య : అవును ఆదిత్యా…రాజకీయ సమస్య కాస్తా…కుటుంబ సమస్య అయి కూర్చున్నది…అందుకని ఈ విషయంలో కత్తులు దూసుకోవడం…ఎత్తులు పై ఎత్తులు వేయడం కన్నా…కూర్చుని మాట్లాడటం ఉత్తమం అనిపిస్తున్నది…
ఆదిత్యసింహుడు : అలాగే పూర్ణయ్య గారు…మీరు చెప్పినట్టు చేస్తాను….(అంటూ తన సేవకుడిని పిలిచి) మా అన్నగారు విజయసింహుల గారితో అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు చేయి….(అంటూ అతనికి కళ్లతోనే వద్దన్నట్టు సైగ చేసాడు.)

ఆ సైగని అర్ధం చేసుకున్న సేవకుడు పైకి మాత్రం అలాగే అన్నట్టు తల ఊపి ఆదిత్యసింహుడికి అభివాదం చేసి అక్కడా నుండి వెళ్ళిపోయాడు.
పూర్ణయ్య : ఇక నేను వస్తాను ఆదిత్యా….(అంటూ ఆసనం నుండి లేచాడు.)
ఆదిత్యసింహుడు : మీకు శ్రమ కలిగించినందుకు నన్ను క్షమించండి పూర్ణయ్య గారు….

పూర్ణయ్య : నువ్వు నా పట్ల చూపిస్తున్న గౌరవానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది ఆదిత్యా….ఇక వస్తాను…(అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.)

మహామంత్రి పూర్ణయ్యని సాగనంపిన తరువాత ఆదిత్యసింహుడు మళ్ళీ తన ఆసనంలో కూర్చుని తన దండనాయకుల వైపు చూస్తూ….
ఆదిత్యసింహుడు : జరుగుతున్న పన్నాగం అదీ….ఇప్పుడు చెప్పండి….మీ అభిప్రాయాలు ఎంటో….
దండనాయకుడు : అదేంటి ప్రభూ….మహామంత్రి పూర్ణయ్య గారు మీకు పూర్తి మద్దతు ఇస్తున్నారు కదా….ఆయన వెళ్ళిన తరువాత మళ్ళీ సమావేశం ఏంటి ప్రభూ….
ఆదిత్యసింహుడు : ఎవరి గౌరవం వాళ్ళకు ఇవ్వాలి దండనాయకా….కొన్ని కొన్ని మనం ఎవరికీ తెలియకుండా చేయాలి ….మనం చేసే పనులు వాళ్లకు నచ్చొచ్చు లేక నచ్చక పోవచ్చు….
దండనాయకుడు : అలా అయితే మనం మీ వదిన స్వర్ణమంజరి దేవి గారిని అంతఃపుర బందీని చేస్తే చక్రవర్తి అవడానికి మీకు అడ్డేమున్నది ప్రభూ….
ఆదిత్యసింహుడు : అలా చేయడం వలన ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది….నాకు అలా చేయడం ఏమాత్రం ఇష్టం లేదు….
దండనాయకుడు : అదేంటి ప్రభూ…ప్రజల గురించి ఆలోచించేదేమున్నది….నాలుగు రోజులు కోప్పడతారు….మళ్ళీ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు….
ఆదిత్యసింహుడు : కాని వాళ్ల మనసుల్లో మాత్రం మనం శాశ్వతంగా తిరుగుబాటు చేసి సింహాసనం దక్కించుకున్నామనే అపవాదు మాత్రం ఉండిపోతుంది….తరువాత మనం ఎంత జనరంజకంగా పాలన సాగించినా ఆ మచ్చ అలాగే ఉండి పోతుంది….
దండనాయకుడు : అది కాదు ప్రభూ….
ఆదిత్యసింహుడు : మనం సింహాసనానికి చాలా దగ్గరలో ఉన్నాం దండనాయకా…ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం మన దారిలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులు తొలగించడమే…దారిలో ఉన్న చిన్న చిన్న ముళ్ళను తొలగించడానికి అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోనవసరం లేదు…నాకు మాత్రం ప్రజల మద్దతుతో సింహాసనాన్ని అధిష్టించాలి…అంతే…
దండనాయకుడు : అయితే ఇప్పుడు ఏం చేద్దాం ప్రభూ…..
ఆదిత్యసింహుడు : మనం వనవిహారానికి వెళ్ళే ముందు కొన్ని పనులు చేయాలి….అవి ఏవేంటో చెబుతాను వినండి….
(అంటూ తన దగ్గర స్వర్ణమంజరి దండనాయకుల వివరాలు ఇచ్చి తన దండనాయకులకు ఏమేం చేయాలో చెప్పాడు.)
ఆదిత్యసింహుడు చెప్పంది అంతా విన్న తరువాత దండనాయకులు అక్కడ నుండి వెళ్ళిపోయారు.
ఆదిత్యసింహుడు తన ఆసనంలో కూర్చుని వనవిహారంలో చేయబోయే పనుల గురించి ఆలోచిస్తున్నాడు.
***********
అవంతీపుర సామ్రాజ్యం నుండి బయలుదేరిన రమణయ్య తన దళంతో పరాశిక రాజ్యానికి చేరుకున్నాడు.
అక్కడ రమణయ్య రాజభవనం లోకి వెళ్ళి స్వర్ణమంజరి అన్నగారైన విక్రమవర్మకు తన రాక గురించి తెలిపి అతన్ని కలవడానికి అనుమతి కోరాడు.
కొద్దిసేపటికి విక్రమవర్మ రాజ్యసభలోకి రమణయ్యకు అనుమతినిచ్చాడు.
రమణయ్య రాజసభలోకి రాగానే విక్రమవర్మకి అభివాదం చేసి….
రమణయ్య : ప్రభూ…నేను అవంతీపుర సామ్రాజ్యం నుంచి వస్తున్నాను….
విక్రమవర్మ : మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉన్నది రమణయ్య గారు…అక్కడ అందరూ బాగానే ఉన్నారు కదా…..
రమణయ్య : దేవుడి దయ వలన అంతా బాగానే ఉన్నారు ప్రభూ….మీకు విషయం తెలిసే ఉంటుంది…రత్నసింహుల వారు తన సింహాసనానికి వారసులు ప్రకటించబోతున్నారు…
విక్రమవర్మ : అవును….మా వేగుల ద్వారా ఆ విషయం తెలిసింది…
రమణయ్య : నేను మీతో ఏకాంతంగా సమావేశం జరపాలి ప్రభూ….మీ సోదరి స్వర్ణమంజరి గారి దగ్గర నుండి సందేశం తెచ్చాను….అది మీకు అత్యవసరంగా మీకు విన్నవించమని మీ సోదరి గారు మరీ మరీ చెప్పమన్నారు….
విక్రమవర్మ : తప్పకుండా….మిమ్మల్ని మా అంతరంగిక మందిరంలో తప్పకుండా సమావేశం అవుదాము…(అంటూ అక్కడ సేవకుడితో) రమణయ్య గారిని మా అంతరంగిక మందరంలో కూర్చోబెట్టు….(అంటూ రాజసభ సభ్యుల వైపు చూస్తూ) ఇక ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాం….
విక్రమవర్మ అలా అనగానే అందరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు.
కొద్దిసేపటి తరువాత విక్రమవర్మ అంతరంగిక మందిరం లోకి వచ్చాడు.
అప్పటికే ఆ మందిరంలో విక్రమవర్మ కోసం ఎదురుచూస్తున్న రమణయ్య అతన్ని చూడగానే లేచి అభివాదం చేసాడు.
విక్రమవర్మ తన ఆసనంలో కూర్చుంటూ….
విక్రమవర్మ : ఇప్పుడు చెప్పండి రమణయ్యా….అంత అత్యవసరంగా సమావేశం అవాల్సిన అవసరం ఏమొచ్చింది….
రమణయ్య : మీ తెలియని విషయం ఏమున్నది ప్రభూ….అవంతీపుర సింహాసనం ఎవరు అధిష్టించాలనేది అక్కడ సమస్యగా ఉన్నది….
విక్రమవర్మ : ఇందులో సమస్య ఏమున్నది రమణయ్యా…రత్నసింహ చక్రవర్తి కుమారుల్లో మా బావగారు విజయసింహుల వారే కదా పెద్ద కొడుకు…ఆయనే సింహాసనాకి అర్హులు కదా….
రమణయ్య : మీరన్నది సబబుగానే ఉన్నది మహారాజా…కాని మీ బావగారు సింహాసనాన్ని అధిష్టించడానికి వీరసింహుల వారు అభ్యంతరం ఏమీ పెట్టలేదు….కాని…..
విక్రమవర్మ : మళ్ళీ ఈ కాని ఏంటి రమణయ్యా….ఇక ఇందులో సమస్య ఏమున్నది….
రమణయ్య : రత్నసింహుల వారి మూడో కొడుకు ఆదిత్యసింహుడు గురించి మీకు తెలిసిందే కదా….
విక్రమవర్మ : అవును రమణయ్యా….ఆదిత్యసింహుడి రాజకీయ చతురత గురించి మేముకూడా చాలా విన్నాము…
రమణయ్య : ఇప్పుడు ఆయనే మీ బావగారు సింహాసనాన్ని అధిష్టించడానికి అడ్డంగా ఉన్నారు….
విక్రమవర్మ : ఏమిటి మీరనేది….

రమణయ్య : అవును మహారాజా….విజయసింహుల వారు సింహాసనాన్ని అధిష్టించడానికి ఆయన తన సమ్మతి తెలపడం లేదు….అందుకనే స్వర్ణమంజరి గారు మీ మద్దతు కోసం మిమ్మల్ని కలవడానికి నన్ను పంపించారు….
విక్రమవర్మ : మిమ్మల్ని మా సోదరితో ఎప్పుడూ చూడలేదు….మీ మాటలు ఎలా నమ్మడం….
రమణయ్య : మీరు మీ సోదరిని కలిసే ఎన్నో ఏండ్లు గడిచింది మహారాజా….
విక్రమవర్మ : సరె…మేము మా వేగులను పంపి విషయం తెలిసిన తరువాత నిర్ణయం తీసుకుంటాను….
రమణయ్య : ఇప్పుడు అంత సమయం లేదు మహారాజా….మీ వేగులు మా రాజ్యానికి వెళ్ళి విషయం తెలుసుకుని వచ్చి మీకు చెప్పేసరికి అక్కడ అంతా పూర్తి అయిపోతుంది మహారాజా….ఇక అప్పుడు మీరు నిర్ణయం తీసుకుని కూడా ఉపయోగం లేదు….
విక్రమవర్మ : మీరు చెప్పింది నిజమే…కాని కేవలం మీ మాటల ఆధారంగా నేను చర్యలు తీసుకోలేను కదా…పైగా మీకు మా రాజ్యం గురించి తెలిసిందే కదా…మాకు అవంతీపురం మీద దాడి చేసే సామర్ద్యం లేదని మీకు తెసుకు కదా…
రమణయ్య : ఆ విషయం నాక్కూడా తెలుసు మహారాజా….కాని మీరు నా మీద ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు…మీకు సాక్ష్యం కావాలంటే మీ సోదరి స్వర్ణమంజరి గారి లేఖను చూడండి….దీని మీద ఆమె రాజముద్రిక కూడా ఉన్నది….(అంటూ తన దుస్తుల్లో దాచిన లేఖని తీసి విక్రమవర్మకి ఇచ్చాడు.)
విక్రమవర్మ లేఖను తీసుకుని పూర్తిగా చదివాడు….కింద స్వర్ణమంజరి ముద్రిక కూడా ఉండటంతో సగం నమ్మకం వచ్చేసింది.
విక్రమసింహుడు : కాని ఈ లేఖలో మమ్మల్ని తనకు సహాయం చేయమన్నట్టుగా ఉన్నది…కాని మా సోదరికి ఏ విధంగా సహాయం చేయగలము…మా సైనిక శక్తి అవంతిపుర సైనికశక్తితో పోల్చుకుంటే చాలా తక్కువ….
రమణయ్య : ఆ విషయం నాకు తెలుసు మహారాజా…అందుకు తగిన పధకం కూడా స్వర్ణమంజరి గారు ఆలోచించి పంపించారు….
విక్రమసింహుడు : ఏమిటా పధకం….
రమణయ్య : ఏం లేదు మహారాజా….ఇంతకు పధకం ఏంటంటే….(అంటూ పధకం ప్రకారం విక్రమవర్మ చేయవలిసిన పని చెప్పాడు.)
అంతా విన్న తరువాత విక్రమసింహుడు…
విక్రమసింహుడు : మీరు చెప్పిన దాని ప్రకారం ఈ పధకం చాలా ప్రమాదకరమైనది రమణయ్యా….
రమణయ్య : మరి చక్రవర్తి సింహాసనం అంత తేలిగ్గా దొరకదు ప్రభూ…అందులోనూ మీ బావగారు చక్రవర్తి కావాలంటే మీరు ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా…..
విక్రమసింహుడు : కాని ఎందుకో నా మనసు దీనికి అంగీకరించడం లేదు రమణయ్యా…..
రమణయ్య : (చిన్నగా నవ్వుతూ) ప్రభువుల వారి మనసులో ఇంకా సందేహం తొలగినట్టు లేదు…
విక్రమసింహుడు : అవును రమణయ్యా…ఇంత తీవ్రమైన పరిస్థితిలో మా సోదరి నుండి వచ్చిన ఈ లేఖ చూసి… (అంటూ రమణయ్య వైపు చూస్తూ) మా సోదరి ఏమైనా సంకేతం లాంటిది చెప్పిందా….
రమణయ్యకు వెంటనే విక్రమవర్మ దేని గురించి అడుగుతున్నాడో బాగా అర్ధమయింది.
రమణయ్య : ప్రభువుల వారికి నా మీద ఇంకా నమ్మకం కలగలేనట్టున్నది…
విక్రమవర్మ : అలాంటిదేం లేదు రమణయ్యా…మీరు ఈ లేఖ తీసుకురాగానే మీరు మా సోదరి స్వర్ణమంజరి గూఢచారి అని అర్ధం అయింది….కాని…..
రమణయ్య : సరె…మీ సంతృప్తి కోసం కేవలం మీకు మీ సోదరికి మాత్రమే తెలిసిన సంకేతాన్ని తెలియపరిస్తే మీకు సమ్మతమే కదా…..
విక్రమవర్మ : తప్పకుండా….మీరు ఆ సంకేతాన్ని తెలియపరిస్తే మేము నిస్సందేహంగా మీరు చెప్పింది నిజమని నమ్మి మా సోదరి ఈ లేఖలో చెప్పిన విధంగా…అదే మీ పధకానికి అణుగుణంగా మా సైన్యాన్ని తరలిస్తాను….
రమణయ్య : సరె…చెబుతున్నా వినండి…మీ సోదరి చెప్పిన సంకేతం ప్రకారం…”మహాభారతంలొ శకుని పాండవులకు ఆప్తమిత్రుడు”….స్వర్ణమంజరి గారు నాకు చెప్పిన సంకేతం ఇదే….
ఆ సంకేతం వినగానే విక్రమసింహుడు సంతోషంగా రమణయ్య వైపు చూస్తూ….
విక్రమవర్మ : ఈ సంకేతం చెప్పగానే మా మనసులో ఉన్న శంకలన్నీ దూరమైపోయాయి రమణయ్య గారు….ఇక నేను ముందుండి నా సైన్యాన్ని మన పధకానికి అనుకూలంగా తరలిస్తాను….
విక్రమవర్మ అలా అనగానే రమణయ్య కూడా చాలా సంతోషపడిపోయాడు.
తను వచ్చిన కార్యం ఇంత తేలిగ్గా అయిపోయినందుకు మనసులోనే మంజులకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు.
రమణయ్య : సరె ప్రభూ…ఇక నేను సెలవు తీసుకుంటాను….
విక్రమవర్మ : అప్పుడేనా రమణయ్యా….ఇప్పటికే సాయంకాలం అయిపోయింది….రేపు ఉదయం బయలుదేరి వెళ్దురు గాని….అప్పటి వరకు మీరు మా అతిధిగృహంలో విశ్రాంతి తీసుకోండి….
రమణయ్య అలాగే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
**********
రమణయ్య వెళ్ళిపోగానే విక్రమవర్మ తన మంత్రి గణాన్ని, సేనాపతితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాడు.
అందరు రాగానే మంత్రులు, సేనాపతులు, దండ నాయకులు తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు.
విక్రమవర్మ గంభీరంగా ఉండటంతో అతని ప్రధాన మంత్రికి విషయం ఏంటో గంభీరమైనదని అర్ధం అయింది.
దానికి తోడు అవంతీపురం నుండి గూఢచారి వచ్చాడనే సరికి ఆయనకు విషయం చూచాయగా తెలిసిపోయింది.
మంత్రి : (విక్రమవర్మ వైపు చూస్తూ) ప్రభువుల వారు చాలా గంభీరంగా ఉన్నారు….విషయం ఏంటి ప్రభూ….
విక్రమవర్మ : (ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకుని) అవును మంత్రిగారు…విషయం చాలా గంభీరమైనదే….ఎలా పరిష్కరించాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను….
మంత్రి : ముందు సమస్య ఏంటో తెలియపరిస్తే దానికి మాక్కూడా తోచినంత సలహా ఇస్తాము కదా ప్రభూ  విక్రమవర్మ : అందుకేగా మీ అందరిని సమావేశ పరిచింది….(అంటూ సభలో కూర్చున్న అందరి వైపు ఒక్కసారి చూసి) ఇంతకు ముందు మన వేగుల ద్వారా మీకు అవంతీపుర నూతన చక్రవర్తి కోసం పట్టాభిషేక ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసిందే కదా…..

సైన్యాధిపతి : ఇందులో కొత్త విషయం ఏమున్నది ప్రభూ….ఇంతకు ముందు మనం చర్చించుకున్నట్టె….మీ సోదరి గారి భర్త అయిన విజయసింహుల వారే న్యాయంగా సింహాసనానికి ఉత్తరాధికారి కదా….
విక్రమవర్మ : అంతా బాగుంటే….ఈ సమావేశం ఎందుకు సేనాధిపతీ….
మంత్రి : ఇంతకు ఏమయింది ప్రభూ….మీ బావగారు సింహాసనం అధిష్టించడానికి అడ్డంకులు ఎవరైనా సృష్టిస్తున్నారా…
విక్రమవర్మ : అవును మహామంత్రి….మా బావగారు విజయసింహుల వారు చక్రవర్తి కావడానికి ఆయన పెద్ద తమ్ముడు వీరసింహుల వారి నుండి ఎటువంటి అభ్యంతరము లేదు….కాని చిన్నతమ్ముడు ఆదిత్యసింహుడు మాత్రం అభ్యంతరం సృష్టిస్తున్నట్టు మా చెల్లెకు స్వర్ణమంజరి నుండి లేఖ వచ్చింది….
మహామంత్రి : ఆ లేఖలో ఉన్న విషయాలు ఎంతవరకు నిజానిజాలో పూర్తిగా పరిశీలించారా మహారాజా….
విక్రమవర్మ : పూర్తిగా పరిశీలించాను మహామంత్రి….వచ్చిన అతను స్వర్ణమంజరి గూఢచారి అనడానికి ఏమాత్రం సందేహం లేదు….మాకు, మా సోదరికి మధ్య ఉన్న రహస్యసంకేతం కూడా చెప్పాడు….దాంతో విషయాన్ని పూర్తిగా నమ్మక తప్పడం లేదు….
మహామంత్రి : ఇంతకు మీ సోదరి కోరుతున్న సహాయం ఏంటి మహారాజా…..
విక్రమవర్మ : తన మరిది ఆదిత్యసింహుడిని అదుపు చేయమని….లేకపోతే అతన్ని బంధించమని కోరుకుతున్నది….
సైన్యాధిపతి : ఆదిత్యసింహుడు అంటే….ఆయన గురించి చాలా విన్నాం మహారాజా….ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి….
విక్రమవర్మ : అదే కదా ఇప్పుడు సమస్య సేనాదిపతి గారు…మరొకరు అయితే పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు….కాని ఇక్కడ ఉన్నది ఆదిత్యసింహుడు…అందువలనే ఇంత ఆలోచించవలసి వస్తున్నది…..
మహామంత్రి : ఇంతకు పధకం ఏంటి మహారాజా….
విక్రమవర్మ : ఒక పధకం ఉన్నది మంత్రి గారు….(అంటూ తన సోదరి స్వర్ణమంజరి రమణయ్యకు చెప్పి పంపించిన పధకం మొత్తం తన పరివారానికి వివరించాడు)
మహామంత్రి : మరి ఈ పధకానికి సైన్యంతో మన సేనాధిపతిని పంపిద్దామా….
విక్రమవర్మ : కాని ఈ పధకానికి నేనే నాయకత్వం వహిస్తాను….
మహామంత్రి : అలా ఎందుకు మహారాజా….ఇది పూర్తి స్థాయి యుధ్ధం కాదు కదా….మన సేనాధిపతుల వారు సరిపోతారు కదా….
విక్రమవర్మ : మీరన్నది నిజమే మంత్రి గారు…కాని ఇది మా సోదరి భవిష్యత్తుకు సంబంధించినది…అందుకని మధ్యలో ఏమైనా అత్యవసర నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మేము ఉంటేనే బాగుండని అనిపిస్తున్నది…
మహామంత్రి : సరె మహారాజా…మీరు నిర్ణయం తీసుకున్న తరువాత మేము చెప్పేది ఏమున్నది…కాని జాగ్రత్త ప్రభూ…
తరువాత కొద్దిసేపు అందరూ చేయవలసిన పనులు ఒకసారి మరల సమీక్షించుకుని అక్కడ నుండి ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.
అందరు వెళ్ళిపోయిన తరువాత విక్రమవర్మ దీర్ఘంగా ఆలోచిస్తూ తన సింహాసనం మీద కూర్చున్నాడు.
అలా కూర్చున్న అతనికి తనను, “మహారాజా….” అని పిలవడంతో ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటపడ్డట్టు తల ఎత్తి ఎదురుగా చూసాడు.
తన రాణి అయిన పద్మిని పరిచారిక జలజ తన ఎదురుగా నిల్చుని అభివాదం చేసి, “మహారాజా…మహారాజా…బాగా దీర్ఘాలోచనలో మునిగినట్టున్నారు,” అని అన్నది.
విక్రమవర్మ తల ఎత్తి జలజ వైపు చూసాడు.
జలజ నవ్వుతూ విక్రమవర్మ వైపు చూస్తూ…..
జలజ : ప్రణామం మహారాజా….బాగా దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు…..
విక్రమవర్మ : అవును జలజా…చాలా పెద్ద సమస్య వచ్చింది…దాని గురించే దీర్ఘాలోచనలో ఉన్నాము….(అంటూ తల ఎత్తి జలజ వైపు చూడగానే మదిలో ఒక ఆలోచన తళుక్కుమన్నది.)
దాంతో విక్రమవర్మ ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి జలజ వైపు చూస్తూ….
విక్రమవర్మ : జలజా….నీ వలన మాకు ఒక్క అత్యవసర పని జరగాల్సి ఉన్నది….
జలజ : చెప్పండి మహారాజా…ఏం చేయాలి….
విక్రమవర్మ : అవంతీపురం నుండి ఒక దూత వచ్చాడు…మా సోదరి సహాయం ఆశిస్తూ ఒక లేఖని, మా ఇద్దరికి మాత్రమే తెలిసిన రహస్యసంకేతం కూడా స్పష్టంగా చెప్పాడు….
జలజ : ఇక ఇందులో సమస్య ఏమున్నది ప్రభూ….
విక్రమవర్మ : కాని ఇక్కడ సమస్య ఏంటంటే….అవంతీపురం సామాన్య రాజ్యం కాదు జలజా…
జలజ : కాని మీకు మీ సోదరికి మాత్రమే తెలిసిన రహస్య సంకేతం ఇంకొకరికి తెలిసే సమస్యే లేదు కదా ప్రభూ….
విక్రమవర్మ : నువ్వు చెప్పింది నిజమే జలజా….కాని చివరిగా ఇంకొక్కసారి అతని విశ్వసనీయతను తెలుసుకుందామని అనిపిస్తున్నది….
జలజ : మరి ఏం చేద్దాం ప్రభూ….నా వలన ఏదైనా కార్యం జరగాల్సి ఉన్నదా…..అనుమతించండి ప్రభూ…..
విక్రమవర్మ : నీకు తెలియనిది కాదు కదా జలజా….మన దగ్గర కామప్రకోపాన్ని ప్రేరేపించే గుళికలను అవంతీపుర దూత రమణయ్య మీద నువ్వు ప్రయోగించి అతని మనసులో ఉన్న రహస్యాన్ని బయటకు లాగాలి….
జలజ : ప్రభూ…ఏమంటున్నారు మీరు…..నేను అతనితో ఎలా….(అంటూ ఇక మాట్లాడలేకపోయింది.) 

twitter link

 

Also Read

కలసి వచ్చిన అదృష్టం

నా మాలతీ 

ఉన్నది ఒక్కటే జిందగీ 

Avanthipura Simhasanam – 14, అవంతీపుర సింహాసనం ,Telugu Boothu Kathalu

https://s.magsrv.com/splash.php?idzone=5160226

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button