Naa Autograph Sweet Memories

Naa Autograph Sweet Memories – 28 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 28 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories – 28 | ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

Naa Autograph Sweet Memories - 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్
Naa Autograph Sweet Memories – 1 || ఆటోగ్రాఫ్ స్వీట్ మొమరీస్

సుమిత్ర : దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి రివర్స్ లో ప్లే చెయ్యి…..అప్పుడర్ధం అవుతుంది….
రాము వెంటనే రికార్డ్ అయిన దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి రివర్స్ లో ప్లే చేసాడు…అప్పుడు అందులో రికార్డ్ అయిన మాటలు ముగ్గురికీ బాగా అర్ధమవుతున్నాయి….
(రికార్డ్ అయిన మాటలు….)
రికార్డర్ : ఎన్నో ఏళ్ళ నుండి నేను ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాను….చాలా ఏళ్ళ నుండి నేను మనుషులతో మాట్లాడదామని ప్రయత్నిస్తూనే ఉన్నాను….ఎందుకంటే నా గురించి జరిగిన విషయాలను చెప్పాలని అనుకుంటున్నాను….కాని నా మాటలు ఎవరికీ వినిపించేవి కావు….కాని మీరు చేసిన ప్రయత్నం వలన నేను మీ కంట్రోల్ లోకి వచ్చి జరిగిన విషయాలు చెబుతున్నాను. నేను మహారాజా గజసింగ్ కుమారుడు రంజిత్ సింగ్ ని….ఇప్పుడు మీకు ఒక ఆడది మా వంశం లోకి అడుగుపెట్టడం వలన ఏ విధంగా కష్టాలు పడ్డాము….ఎలా చనిపోయామో….అది ఇంకా ఆత్మ రూపంలో ఎలా బ్రతికి ఉన్నది చెప్పాలనుకుంటున్నాను….
(ఫ్లాష్ బ్యాక్ 300 ఏళ్ళు వెనక్కి)
బాహ్లిక రాజ్యం….
రాజమహల్ లో నుండి గజసింగ్ రెండవ భార్య మోహిని మాత్రం చాలా అసహనంగా ఉన్నది.

మోహిని గురించి తెలిసిన ఆమె పరిచారిక, “ఇంకొక్క సారి బాగా ఆలోచించుకోండి మహారాణీ….ఒక్కసారి బాణం ధనస్సు నుండి బయటకు వెళ్ళిందంటే దాన్ని ఆపడం ఎవరితరం కాదు….” అన్నది.
మోహిని : ఇప్పుడు ఎవరు ప్రశాంతంగా ఉన్నారు మంధర….ఒక ఆడదానిగా నాలో ముసలి మొగుడికి భార్యగా, వాడి ఈడొచ్చిన పిల్లలకు అమ్మగా నేను ఉండలేకపోతున్నాను…ఇక నా వల్ల కాదు….ఎదైతే అది జరిగింది…నేను ముందుకు అడుగు వేయడానికే నిర్ణయించుకున్నాను…..
మంధర : కాని మహారాజు గారు యుధ్ధానికి వెళ్ళారు….ఆయన రావడానికి చాలా సమయం పడుతుంది…
మోహిని : మంచిదే కదా….ఈ సమయాన్ని మనం ఉపయోగించుకుందాము….
అంతలో ఒక పరిచారిక వచ్చి మోహినికి నమస్కారం చేసి, “మహారాణీ….మీరు మీ పూజకు సిధ్ధం చేయమన్నవి అన్ని సిధ్ధం చేసాను….” అన్నది.
మోహిని సరె అని తల ఊపుతూ ఆమెని వెళ్ళిపోమని తన పరిచారిక మంధర వైపు తిరిగి, “నేను వెళ్ళి పూజ చేసి వస్తాను….నువ్వు వెళ్ళి నేను చెప్పిన పనులు చేయి….ఎలాగైనా సరె….నేను ఈ రాజ్యాన్ని చేజిక్కించుకుని తీరతాను…” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రాజ్యం మొత్తంలో మోహిని గురించి మంధరకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే….మోహిని రహస్యంగా తన మహల్ లొనుండి ఒక రహస్య మార్గం అడవిలోకి ఏర్పరుచుకుని అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నది మంధరకు తప్పించి ఎవరికీ తెలియదు.
అలా మోహిని తన మహల్ లోనుండి సొరంగం ద్వారా అడవిలోకి వెళ్ళి తన క్షుద్ర పూజలు ముగించుకుని మళ్ళీ తన మహల్ లోకి వచ్చి ఏమీ జరగనట్టు అంతఃపురం పనుల్లో మునిగిపోతుంది.
ఆ తరువాత రోజు ఉదయాన్నే రాజ మహల్లో కోలాహలం మొదలయింది…..రాజు గారు యుధ్ధం నుండి ఇంకొద్ది సేపటిలో కోటకు రాబోతున్నారనే వార్త వచ్చింది.
దాంతో కోటలో ఉన్న దాసీలు అంతా నిద్ర లేచి గబగబ రెడీ అయ్యి ఆయన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మహారాణీ మోహిని కూడా తన మొగుడికి, అతనితో పాటు వస్తున్న మొదటి కొడుకు రంజిత్ సింగ్, రెండవ కొడుకు దల్బీర్ సింగ్ కి స్వాగతం పలకాల్సి ఉన్నది.

వెంటనే మహారాణి మోహిని తనకు నమ్మకమైన సైనికాధికారులందరినీ పిలిపించింది.
అందరిని సమావేశ పరికి రాజుగారు కోటలోకి వచ్చిన తరువాత ఏం చేయాలి….ఎలా దాడి చేయాలో అంతా పధకం ప్రకారం వివరంగా చెప్పి పంపించింది.
కాని మహారాజు ప్రయాణంలో ఉండగానే గూఢచారుల ద్వారా తిరుగుబాటు సంగతి గజ సింగ్ కి తెలిసిపోయింది.

వెంటనే గజసింగ్ తన ఇద్దరు కుమారులను పిలిపించి తిరుగుబాటు సంగతి చెప్పి కోటలోకి వెళ్ళిన తరువాత ఏం చేయాలి అనేది ఒక పధకం వేసుకుని మళ్ళీ ప్రయాణం సాగించి కోట లోపలికి వెళ్ళారు.
కోట లొపలికి వెళ్ళిన మహారాజు గజసింగ్ కి, అతని ఇద్దరు కుమారులకు మహారాణి మోహిని ఘనంగా స్వాగతం పలికింది.
అందరు ఎవరి పధకం ప్రకారం వాళ్ళు పావులు కదుపుతున్నారు.
మహారాజు అంతఃపురం లోకి వెళ్ళీ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత రాజ కుటుంబం మొత్తం పూజ గదిలోకి వెళ్ళి పూజ చేయడం మొదలు పెట్టారు.
పూజ చేస్తుండగా మోహిని తన పరిచారిక అయిన మంధర వైపు చూసింది….మంధర వెంటనే తమ సైన్యాలకు సైగ చేసింది.
ఇది ముందే ఊహించిని గజసింగ్ చిన్నగా తల తిప్పి తన కొడుకు రంజిత్ సింగ్ వైపు చూసాడు.
రంజిత్ సింగ్ వెంటనే మోహిని గమనించకుండా అక్కడ నుండి బయటకు వచ్చి కోటలో రహస్యంగా దాక్కున్న తన సేనలకు సైగ చేసి తిరుగుబాటుని అణిచివేయడానికి సైన్యాన్ని సమాయత్త పరిచాడు.
దాంతో రెండు పక్షాలు భీకరంగా యుధ్ధం చేసుకున్నాయి….కాని రంజిత్ సింగ్ సైన్యం తిరుగుబాటుదారుల్ని నాలుగు వైపులా చుట్టుముట్టడంతో….ఒక్కసారిగా ఊహించని పరిణామానికి తిరుగుబాటు దారులు తేరుకునె లోపు రంజిత్ సింగ్ సైన్యం వాళ్ళను ఊచకోత కోసేసింది.
ఇక్కడ పూజగదిలో గజసింగ్ పూజ చేస్తుండగా మోహిని ఒక్కసారిగా తన బొడ్లోని కత్తిని తీసి మెరుపు వేగంతో గజ సింగ్ గుండెల్లో దించింది.
కత్తికి విషం పూసి ఉండటంతో గజసింగ్ అక్కడికక్కడె ప్రాణాలు విడిచేసాడు.
వెంటనే గజ్ సింగ్ రెండవ కొడుకు దల్బీర్ సింగ్ తేరుకుని మోహినిని బంధించేసాడు.
బయట తిరుగుబాటుని పూర్తిగా అణిచివేసిన తరువాత రంజిత్ సింగ్ లొపలికి వచ్చి జరిగింది తెలుసుకుని మహారాణి మోహినిని సంకెళ్లతో బంధించి కారాగారంలో పడేసాడు.
దాంతో రంజిత్ సింగ్ తమ దారిలో ఉన్న అడ్డంకి మొత్తం తొలగిపోవడంతో అతని రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు.
రంజిత్ సింగ్ తన మహల్ లో ఉండగా మహామంత్రి వచ్చి….
మహామంత్రి : మీరు మహారాణీ మోహినిని కారాగారంలొ వేసారు…..కాని….
రంజిత్ సింగ్ : కాని….కాని ఏంటి మంత్రి గారు….
మహామంత్రి : కాని ఆమె కారాగారంలో ఉన్నంత మాత్రాన మీ స్రామ్రాజ్యం పూర్తి రక్షణలో ఉన్నట్టు కాదు మహారాజా….
రంజిత్ సింగ్ : మీరు ఏం చెబుతున్నారో మాకు అర్ధం కావడం లేదు మంత్రి గారు…ఏం చెప్పాలనుకుంటున్నారో వివరంగా చెప్పండి.
మహామంత్రి : నా గూఢచారులు తెచ్చిన సమాచారం ప్రకారం మోహిని తంత్ర, మంత్ర, క్షుద్ర విద్యలలో ఆరితేరిపోయింది….అందుకని ఆమెను ప్రాణాలతొ ఉంచడం ఏమాత్రం మంచిది కాదు….
రంజిత్ సింగ్ : సరె…..అయితే ఈ ప్రమాదం నుండి గట్టెక్కడానికి ఉపాయం ఆలోచించి…అమలు పరచండి….
మహామంత్రి అలాగే అని తల ఊపి అక్కడనుండి వెళ్ళిపోయాడు.
************
కారాగారంలో మోహిని అక్కడ గట్టు మీద కూర్చుని కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నది.
అంతలొ ఆమె పరిచారిక మంధర వచ్చి….
మంధర : నమస్కారం మహారాణి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button